మహేష్, బన్నీ దారిలో రవితేజ.. లగ్జరీ మల్టీప్లెక్స్

15-04-2024 10:36:27 PM

మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ, అల్లు అర్జున్‌తో కలిసి ఏఏఏ కట్టించాడు. ఇక ఇప్పుడు సుదర్శన్ థియేటర్‌ను ఏఎంబీ విక్టరీ అని కట్టిస్తున్నారట. అందుల ో మహేష్ బాబు వెంకటేష్ భాగస్వామ్యులు కానున్నారట. ఇదే దారిలో రవితేజ సైతం మల్టీప్లెక్స్ మీద కన్నేశాడని తెలుస్తోంది. ఉప్పల్ సైడ్‌ ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏఆర్‌టీ పేరుతో ఈ మల్టీప్లెక్స్ రాబోతోందట. ఈ మల్టీప్లెక్స్ పూజా కార్యక్రమాలు ఆదివారం జరిగినట్టుగా సమాచారం.

ఇక రవితేజ చివరగా ఈగల్ సినిమాతో వచ్చాడు. అంతకు ముందు టైగర్ నాగేశ్వరరావు అని పర్వాలేదనిపించాడు. దాని కంటే ముందు ధమాకా అంటూ హిట్టు కొట్టాడు. ఒక హిట్టు రెండు మూడు ఫ్లాపులు అన్నట్టుగా రవితేజ కెరీర్ సాగుతోంది. ఈగల్ మూవీకి మంచి పేరు అయితే వచ్చింది కానీ అంతగా కలెక్షన్లు రాలేదని తెలుస్తోంది. ఈగల్ కమర్షియల్‌గా అంత వర్కౌట్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. అయితే ఈగల్ సీక్వెల్ కూడా రానున్న సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రాజెక్ట్ డీటైల్స్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ అంటూ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. రైటర్ భానుతో రవితేజ తన కొత్త మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే.