27-04-2024
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సంస్థ అపోలో 24/7 భారీ నిధుల సమీకరణకు ఒప్పందం కుదుర్చుకుంది. అపోలో 24/7 ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వంట్ క్యాపిటల్ నుంచి రూ.2,475 కోట్ల ఈక్విటీ మూలధనాన్ని సమీకరించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు అపోలో హెల్త్ శుక్రవారం ప్రకటించింది.
27-04-2024
పాసింజర్ వాహనాల్లో మార్కెట్ లీడర్ అయిన మారుతి సుజుకి క్యూ4 లో విశ్లేషకుల అంచనాలకు అనుగుణమైన ఫలితాల్ని ప్రకటించింది. 2024 మార్చి త్రైమాసికంలో మారుతి స్టాండెలోన్ నికరలాభం.
27-04-2024
భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు ఏప్రిల్ 19తో ముగిసిన వారంలో మరో 2.83 బిలియన్ డాలర్ల మేర తగ్గి 640.33 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం ఏప్రిల్ 12తో ముగిసిన వారంలో ఇవి భారీగా 5.4 బిలియన్ డాలర్లు క్షీణించి 643.16 బిలియన్ డాలర్లకు చేరాయి.
27-04-2024
దేశంలో మూడవ పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలానికి సంపాదించిన రూ.3,983 కోట్ల నికరలాభంతో పోలిస్తే వృద్ధి దాదాపు ఫ్లాట్గా ఉన్నది.
27-04-2024
రెండు రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర శుక్రవారం పెరిగింది. ప్రపంచ మార్కెట్ సంకేతాలకు అనుగుణంగా హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.440 మేర పెరిగి రూ.72,710 వద్దకు చేరింది.
27-04-2024
ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం ఇంధన ధరలేనని, ఇందులో ఆహారోత్పత్తుల పాత్ర తక్కువేనని రిజర్వ్బ్యాంక్ విడుదల చేసిన ఒక పరిశోధనాపత్రంలో ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.